భారత్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ ఓడిన ఇంగ్లండ్.. ఎలాగైనా రెండో మ్యాచ్ నెగ్గాలని చూస్తోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ టాస్ గెలిచాడు. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని తెలిపాడు. తమ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నట్లు చెప్పిన బట్లర్.. డేవిడ్ విల్లే, రిచర్డ్ గ్లీసన్ ఆడుతున్నట్లు చెప్పాడు.
తాము టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగే చేసేవాళ్లమని రోహిత్ అన్నాడు. జట్టులో నాలుగు మార్పులు ఉన్నట్లు వెల్లడించాడు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, పంత్ ఆడుతున్నట్లు పేర్కొన్నాడు. రోహిత్తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారత జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
ఇంగ్లండ్ జట్టు: జేసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలాన్, మొయీన్ అలీ, లియామ్ లివింగ్స్టన్, హ్యారీ బ్రూక్, శామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లే, రిచర్డ్ గ్లీసన్, మ్యాట్ పార్కిన్సన్
England have won the toss and elect to bowl first in the 2nd T20I
A look at our Playing XI for the game 👇👇
Live – https://t.co/o5RnRVGuWv #ENGvIND pic.twitter.com/SkEUSwtzVW
— BCCI (@BCCI) July 9, 2022