మూడో వన్డేలో ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. 46వ ఓవర్లో బంతి అందుకున్న చాహల్.. ఆ జట్టు ఇన్నింగ్స్ ముగించాడు. ఆ ఓవర్ తొలి బంతికే ఓవర్టాన్ కొట్టిన బంతిని లాంగాఫ్లో ఉన్న సిరాజ్ సరిగా జడ్జ్ చెయ్యలేకపోయాడు. దాంతో అతని చేతుల్లో పడి గాల్లోకి లేచిన బంతి బౌండరీ ఆవల పడింది.
మరుసటి బంతి డాట్ బాల్ కాగా.. తర్వాత మరోసారి లాంగాఫ్ మీదుగా సిక్సర్ బాదేందుకు ఓవర్టాన్ ప్రయత్నించాడు. ఈసారి అక్కడ ఫీల్డింగ్కు వచ్చిన కోహ్లీ ఎలాంటి పొరపాటు చెయ్యకుండా క్యాచ్ పట్టేశాడు. దాంతో ఓవర్టాన్ (32) ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టాప్లే (0)ను చాహల్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
కార్సే సింగిల్ తీయడంతో స్ట్రైకింగ్కు వచ్చిన టాప్లే.. తను ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కూడా ముగిసింది. మొత్తమ్మీద 45.5 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ జట్టు 259 పరుగులకు ఆలౌట్ అయింది.
రెండో వన్డేలో భారత్ను 146 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్లో కూడా అలాంటి ప్రదర్శనే చెయ్యాలని ప్రయత్నిస్తోంది. కాగా, భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 4, చాహల్ 3 వికెట్లతో సత్తా చాటారు. సిరాజ్ 2 వికెట్లు తీయగా.. జడేజా ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.