మూడో వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 260 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ (1) స్వల్పస్కోరుకే పెవిలియన్ చేరాడు. రీస్ టాప్లే వేసిన మూడో ఓవర్ తొలి బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన ధావన్ దాన్ని డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించాడు.
అయితే బంతిని సరిగా అంచనా వేయలేకపోవడంతో అది గాల్లోకి లేచి పాయింట్లో ఉన్న రాయ్ వైపు వెళ్లింది. దాన్ని అతను సులభంగా అందుకోవడంతో ధవన్ మైదానం వీడాడు.