భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ మొదటి వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన రెండో ఓవర్లో జేసన్ రాయ్ (0) డకౌట్గా వెనుతిరిగాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని ఆడేందుకు ప్రయత్నించిన రాయ్.. దాన్ని సరిగా అంచనా వేయలేకపోయాడు. దాంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చింది. రాయ్ అవుటవడంతో భారత జట్టు సంబరాలు చేసుకుంది.
పరుగుల ఖాతా కూడా తెరవకుండా మైదానం వీడిన రాయ్ స్థానంలో ఇంగ్లండ్ మాజీ సారధి, సూపర్ ఫామ్లో ఉన్న జో రూట్ క్రీజులోకి వచ్చాడు. అతను కూడా తను ఎదుర్కొన్న రెండో బంతికే బుమ్రా అవుట్ చేశాడు. ఆఫ్ స్టంప్ ఆవలగా వేసిన బంతి ఎక్స్ట్రా బౌన్స్ అవడంతో రూట్ తడబడ్డాడు.
ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ పంత్ చక్కగా అందుకున్నాడు. తన మొదటి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే రెండు వికెట్లు తీశాడు బుమ్రా. ఆ మరుసటి ఓవర్లోనే తను కూడా సత్తా చాటిన షమీ.. బెన్ స్టోక్స్ (0)ను డకౌట్ చేశాడు.