ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టు ఘోర పరాజయం మూటగట్టుకుంది. 377 పరుగుల భారీ లక్ష్యాన్ని కాచుకోలేక ఓటమిపాలైంది. ఈ క్రమంలో భారత జట్టు తాత్కాలిక సారధి జస్ప్రీత్ బుమ్రా.. మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. రెండో ఇన్నింగ్స్లో తమ జట్టు సరిగా బ్యాటింగ్ చెయ్యలేదని, అప్పుడే మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మళ్లిందని అభిప్రాయపడ్డాడీ పేసర్.
తొలి ఇన్నింగ్స్లో అదరగొట్టిన పంత్, జడేజాను మెచ్చుకున్న బుమ్రా.. ‘‘నన్ను అప్పుడే ఆల్రౌండర్ అనే సాహసం చెయ్యను. ఈ మ్యాచ్లో తొలి మూడు రోజులు మేము అద్భుతంగా ఆడాం. నాలుగో రోజు బ్యాటుతో వెనకపడ్డాం. అంతే మ్యాచ్ మా చెయ్యి జారిపోయింది’’ అని అన్నాడు.
సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అవ్వకపోతే.. అది తామే గెలిచేవాళ్లమని, తద్వారా సిరీస్ కూడా తమకే దక్కేదని చెప్పాడు. అయితే ఈ టెస్టులో ఇంగ్లండ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని, ఇది సరైన ఫలితమేనని అభిప్రాయ పడ్డాడు. భారత్ నిర్దేశించిన 378 పరుగుల లక్ష్యాన్ని రూట్, బెయిర్స్టో కలిసి సులభంగా ఛేదించారు. వీళ్లిద్దరూ కలిసి నాలుగో వికెట్కు అజేయంగా 269 పరుగులు జతచేయడంతో మ్యాచ్ గెలిచిన ఇంగ్లండ్.. ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో సమం చేసింది.