ఇంగ్లండ్ టెస్టులో స్టార్ ఆటగాడు బెయిర్స్టో సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో తన అలవాటుకు భిన్నంగా నిదానంగా ఆడుతూ విమర్శలపాలైన బెయిర్స్టో.. మూడో రోజు ఆటలో జూలు విదిల్చాడు. కోహ్లీతో చిన్న వాగ్వాదం జరిగిన తర్వాత భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే ఆ తర్వాత గొడవ సద్దుమణిగింది.
ఇక అంతే, రెచ్చిపోయాడు. బుమ్రాను పక్కనపెట్టి శార్దూల్, సిరాజ్ బౌలింగ్లో భారీ షాట్లు ఆడాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి ఇది వరుసగా మూడు టెస్టుల్లో మూడో సెంచరీ కావడం విశేషం. దీంతో ఇంగ్లండ్ జట్టు ఫాలో ఆన్ ప్రమాదం తప్పించుకొని 6 వికెట్ల నష్టానికి 237 పరుగులో నిలిచింది.