సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన ట్వీట్లతో అలరించే బిజినెస్మేన్ ఆనంద్ మహీంద్రా. ఆయన తాజాగా టీమిండియాపై చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇంగ్లండ్తో తొలి వన్డేలో భారత జట్టు అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. బుమ్రా విజృంభించడంతో ఇంగ్లండ్ జట్టు 110 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ లక్ష్యాన్ని రోహిత్, శిఖర్ ధావన్ జోడీ కేవలం 18.4 ఓవర్లలోనే ఛేదించింది. దీనిపైనే సెటైర్ వేసిన మహీంద్రా.. ‘‘నేను భారత జట్టుపై కంప్లయింట్ చేస్తా. ఇంత తక్కువ సమయంలో ఇంత దారుణంగా, ఆధిపత్యం చెలాయిస్తూ విజయం సాధిస్తే ఎలా? నేను టీవీ ఆన్ చేసే సరికే మ్యాచ్ పూర్తయిపోయింది’’ అని ట్వీట్ చేశారు.
ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. తమకు కూడా అదే అనుభవం ఎదురైందని కొందరు అంటుంటే.. టీ20 ప్రపంచకప్ తర్వాత కంప్లయింట్ ఇవ్వాలని, అప్పటి వరకు ఆటగాళ్లను డిస్టర్బ్ చేయడం మంచిది కాదని కొందరు సలహాలు కూడా ఇస్తున్నారు. రెండో వన్డే మ్యాచ్ గురువారం నాడు లార్డ్స్ మైదానంలో జరగనుంది.
I’m filing a complaint against #TeamIndia For such a brutally dominant victory in such a short time. Because by the time I switched on the TV, the match was done… 😊 https://t.co/eamaNlZxAR
— anand mahindra (@anandmahindra) July 13, 2022