Uppal Stadium | హైదరాబాద్ : ఉప్పల్( Uppal )లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం( RGI Cricket Stadium )లో ఏప్రిల్ 2 నుంచి మే 18వ తేదీ వరకు మొత్తం ఏడు ఐపీఎల్ మ్యాచ్లు( IPL Matches ) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం( Uppal Stadium ) వద్ద రాచకొండ పోలీసులు( Rachakonda Police ) పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రాచకొండ పోలీసు కమిషన్ డీఎస్ చౌహాన్( DS Chauhan ).. శనివారం ఉదయం స్టేడియంను పరిశీలించారు. ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో 1500 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. స్టేడియం లోపల, వెలుపల మొత్తం 340 సీపీ కెమెరాలను( CC Camera ) ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జాయింట్ కమాండ్, కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు.
ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించేందుకు వచ్చే యువతులు, మహిళలు ఈవ్ టీజింగ్కు గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నామని సీపీ తెలిపారు. షీ టీమ్స్ కూడా నిఘా పెట్టనున్నట్లు పేర్కొన్నారు. డే మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల కంటే ముందు స్టేడియంను తెరుస్తామని తెలిపారు. నైట్ మ్యాచ్లు జరిగినప్పుడు సాయంత్రం 4:30 గంటలకు స్టేడియం తెరవనున్నారు.
ల్యాప్టాప్స్, వాటర్ బాటిల్స్, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్, మ్యాచ్ బాక్స్, లైటర్స్, పదునైన ఆయుధాలు, ప్లాస్టిక్ వస్తువులు, బైనాక్యూలర్స్, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్స్, పర్ఫ్యూమ్స్, బ్యాగ్స్, తినుబండారాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.