ECB : మహిళల పొట్టి ప్రపంచకప్ ముగియడమే ఆలస్యం ఇంగ్లండ్(England), భారత జట్ల(Team India) మధ్య టెస్టు పోరు మొదలవ్వనుంది. మూడు మ్యాచ్ల పొట్టి సిరీస్లో భారత జట్టును చిత్తు చేసిన ఆతిథ్య జట్టు.. ఈసారి లార్స్డ్ (Lords) మైదానంలో బిగ్ ఫైట్కు సిద్ధమవుతోంది. ఇరుజట్ల మధ్య తొలి టెస్టు కోసం గురువారం ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు పటిష్టమైన స్క్వాడ్ను ప్రకటించింది.
స్వదేశంలో పొట్టి సిరీస్లో భారత మహిళల జట్టును 2-0తో ఓడించిన ఇంగ్లండ్ లార్డ్స్ టెస్టులో పకడ్బందీగా బరిలోకి దిగనుంది. ఈ మైదానంలో ఇరుజట్లు తొలిసారి ఎర్ర బంతితో తలపడనున్నాయి. దాంతో, నాట్ సీవర్ బ్రంట్ కెప్టెన్గా 15 మందితో కూడిన బృందాన్ని ఇంగ్లండ్ వేల్స్ బోర్డు ప్రకటించింది.
JUST IN: England name their squad to face India in the first-ever women’s Test match at Lord’s 🏴
Alice Capsey, Tilly Corteen-Coleman and Mady Villiers will be hoping to make their Test debuts, while Grace Potts and Ellie Threlkeld could earn their first international cap in any… pic.twitter.com/M37OeuDSmo
— ESPNcricinfo (@ESPNcricinfo) June 18, 2026
జూలై 10 నుంచి జరిగే ఈ మ్యాచ్తో ఆల్రౌండర్ అలీసే క్యాప్సే, టిల్లీ కార్టీన్ – కొలేమన్, మాడీ విల్లెర్స్లు టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నారు. అలానే స్క్వాడ్లోని గ్రేస్ పాట్స్, ఎల్లీ త్రెల్కెల్డ్లు అంతర్జాతీయ క్రికెట్లో తొలి మ్యాచ్ ఆడనున్నారు.
ఇంగ్లండ్ టెస్ట్ స్క్వాడ్ : నాట్ సీవర్ బ్రంట్(కెప్టెన్), టమ్మీ బ్యూమంట్, లారెన్ బెల్, మలా బౌచర్, అలీసే క్యాప్సే, టిల్లి కార్టీన్ కొలెమన్, సోఫీ ఎకిల్స్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్(వికెట్ కీపర్), హీథర్నైట్, ఎమ్మా లాంబ్, గ్రేస్ పాట్స్, ఎల్లె త్రెల్కీడ్, మాడీ విల్లెర్స్, ఇస్సీ వాంగ్.