బెంగళూరు: సౌత్జోన్, వెస్ట్జోన్ మధ్య దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతున్నది. డిఫెండింగ్ చాంపియన్గా టైటిల్ నిలబెట్టుకోవాలని వెస్ట్జోన్ చూస్తుంటే..మరోవైపు సౌత్జోన్ సత్తాచాటేందుకు తహతహలాడుతున్నది. బుధవారం మొదలైన మ్యాచ్లో సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లకు 182 పరుగులు చేసింది. కెప్టెన్ హనుమ విహారి(63) అర్ధసెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు.
ఓవైపు రికీ భూయ్(9), సచిన్ బేబి (7), సాయికిషోర్ (5) విఫలం కాగా, తిలక్వర్మ (40), మయాంక్ అగర్వాల్ (28) ఫర్వాలేదనిపించారు. ఓవైపు సహచరుల నుంచి సరైన సహకారం లేకున్నా..విహారి సాధికారిక ఇన్నింగ్స్తో ముందుకు నడిపించాడు. నాగస్వాలా, చింతన్, శమ్స్ ములానీ రెండేసి వికెట్లు తీశారు.