న్యూఢిల్లీ: ప్రొ లీగ్ హాకీ పోటీలలో ప్రపంచ చాంపియన్ జర్మనీ, నాలుగో ర్యాంకర్ ఆస్ట్రేలియాలతో తలపడే భారత జట్టుకు డ్రాగ్ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. మిడ్ఫీల్డర్ హార్దిక్ సింగ్ వైస్కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
ప్రొ లీగ్ కోసం 20 మందితో కూడిన జట్టును హాకీ ఇండియా ఎంపిక చేసింది. మార్చి 10న జరిగే తొలి మ్యాచ్లో భారత్-జర్మనీ, మార్చి 11న జర్మనీ-ఆస్ట్రేలియా, మార్చి 12న భారత్-ఆస్ట్రేలియా, మార్చి 13న భారత్-జర్మనీ, మార్చి 14న జర్మనీ-ఆస్ట్రేలియా, మార్చి 15న భారత్-ఆస్ట్రేలియా తలపడతాయి.