అడిలైడ్: టీ20 వరల్డ్కప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఉండబోదని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపారు. గురువారం రెండవ సెమీస్లో ఇండియాతో ఇంగ్లండ్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ కెప్టెన్ బట్లర్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు. ఫైనల్లో పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరగకుండా ఉండేలా చూస్తామని అన్నారు. సెమీస్లో ఇండియాను ఓడిస్తామని బట్లర్ ధీమా వ్యక్తం చేశారు.
భారత జట్టు బలంగా ఉందని, చాన్నాళ్ల నుంచి భారత జట్టు నిలకడగా ఆడుతోందని, బ్యాటింగ్-బౌలింగ్లో డెప్త్ ఉందని, ట్యాలెంట్ ఉన్న ప్లేయర్లు ఉన్నారని, ఇండియన్ లైనప్ బాగుందని బట్లర్ తెలిపారు. సూర్యకుమార్ గురించి కామెంట్ చేస్తూ టోర్నీలోనే అతనో ఉత్తమ బ్యాటర్గా తేలినట్లు చెప్పాడు. స్వేచ్ఛగా షాట్లు ఆడడమే అతని బలం అని తెలిపారు.