ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ మరోసారి వాక్సిన్ చిక్కుల్లో పడ్డాడు. ప్రతిష్టాత్మక ఇండియాన వెల్స్, మియామీ ఓపెన్ టోర్నీలో పాల్గొనడానికి అమెరికాలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
అమెరికాలో వచ్చే నెల 9 నుంచి మియామీ ఓపెన్, 22న ఇండియన్ వెల్స్ జరుగనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనాలంటే క్రీడాకారులు కరోనా వ్యాక్సిన్ను ఖచ్చితంగా తీసుకుని ఉండాలి. లేకుంటే అమెరికాలో ప్రవేశం నిషిద్ధం. అయితే ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ను తీసుకోని జకోవిచ్.. టోర్నీలో పాల్గొనడానికి ప్రత్యేక దరఖాస్తు చేసుకున్నాడు.
ఇండియన్ వెల్స్లో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన జకోవిచ్.. తాజాగా ఈ టోర్నీకి సంబంధించిన ఎంట్రీ లిస్ట్లో చోటు సంపాదించాడు. దీనిపై అతడి సోదరుడు జార్డి జకోవిచ్ మాట్లాడుతూ.. నోవాక్ ఈ టోర్నీ కోసం ప్రత్యేక అనుమతిని పొందవలసి ఉంది. వాక్సిన్ తీసుకొని వ్యక్తులకు అమెరికా ఇప్పటికీ ప్రవేశాన్ని నిరాకరిస్తోంది. దీనిపై అగ్రరాజ్యం అలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలిపాడు.
కాగా ఇంతకుముందు అస్ట్రేలియా ఓపెన్కి కూడా జకోవిచ్ కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో ఆ టోర్నీలో పాల్గొనడానికి నిర్వహకులు అడ్డుచెప్పారు. దీంతో టోర్నీ నుంచి వైదోలిగాడు.