టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. వెస్టిండీస్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో కూడా తన ధనాధన్ ఆటతీరుతో అలరించాడు. ఆరు వికెట్ల నష్టానికి 138 పరుగులతో ఉన్న భారత్.. దినేష్ కార్తీక్ (19 బంతుల్లో 41 నాటౌట్) అదరగొట్టడంతో 190 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఆ తర్వాత బౌలర్లు కూడా రాణించడంతో 68 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం అశ్విన్తో ముచ్చటించిన డీకే.. గతంతో పోలిస్తే ప్రస్తుతం భారత జట్టు చాలా మారిందని చెప్పాడు. డ్రెస్సింగ్ రూంలో చాలా ప్రశాంత వాతావరణం ఉందని, ఆ క్రెడిట్ అంతా కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్కే దక్కుతుందని అన్నాడు.
ఆటగాళ్లు స్వేచ్ఛగా ఉండేందుకు సహాయపడగలిగే వాళ్లను కూడా జట్టుతో కలుపుకుంటూ పోతున్నారని, ఇది ఇప్పుడు వచ్చిన మార్పేనని అన్నాడు. అలాగే ఇప్పుడు ఆడే మ్యాచులన్నీ కూడా వరల్డ్ కప్ కోసం జరిగే సన్నాహకాల్లాంటివేనని చెప్పాడు. మెగాటోర్నీకి ముందు ప్రతి బాక్సు టిక్ చేసుకోవాలని, అయితే అంతిమ లక్ష్యం మాత్రం వరల్డ్ కప్లో రాణించడమేనని స్పష్టంచేశాడు.
2 great friends, 1 good chat 🤝 👌
Presenting @ashwinravi99 & @DineshKarthik from Trinidad as the duo talk about each others' career, dressing room atmosphere & the upcoming T20 World Cup. 👍 👍 – By @28anand
Full interview 🎥 🔽 #TeamIndia | #WIvIND https://t.co/o1Vv3lwTBl pic.twitter.com/yXMEv4N8x5
— BCCI (@BCCI) July 30, 2022