Virat Kohli : న్యూజిలాండ్పై రెండో టీ 20లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్పై టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ‘ఈ ఇన్నింగ్స్ ద్వారా అతను ప్రపంచంలో ఎందుకు ఉత్తమ బ్యాటర్ అనేది సూర్య మరొకసారి నిరూపించాడు. నేను మ్యాచ్ చూడలేదు. అయితే.. ఇది సూర్య ఆడిన మరొక వీడియో గేమ్ ఇన్నింగ్స్ అని కచ్చితంగా చెప్పగలను’ అని కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు.
రెండో టీ 20లో 49 బంతుల్లో సెంచరీ చేసిన సూర్య 111 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దాంతో, భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్లో న్యూజిలాండ్ 126 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ టీమ్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లు విఫలమవ్వడంతో భారత్ 65 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Numero Uno showing why he’s the best in the world. Didn’t watch it live but I’m sure this was another video game innings by him. 😂 @surya_14kumar
— Virat Kohli (@imVkohli) November 20, 2022