భువనేశ్వర్: ఒడిశాలో జరిగిన రైలు దుర్ఘటన విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో 275 మంది మృతిచెందారు. అయితే రైలు ప్రమాద బాధితులకు సెలబ్రిటీలు, క్రికెటర్లు భారీ ఎత్తున విరాళాలు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్కు చెందిన కెప్టెన్ ధోనీ(MS Dhoni).. ఒడిశా రైలు బాధితులకు 60 కోట్లు డొనేట్ చేసినట్లు వాట్సాప్తో పాటు ఇతర ప్లాట్ఫామ్ల్లో మెసేజ్ ఫార్వర్డ్ అవుతోంది. అయితే ఆ మెసేజ్ బోగస్ అని తేలింది. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ధోనీ ఎటువంటి విరాళం ఇవ్వలేదని తేల్చారు.
టెలిగ్రాం, వాట్సాప్తోపాటు ఇతర సోషల్ మీడియా అకౌంట్లలో ఫేక్ మెసేజ్ తిరుగుతున్నట్లు నిర్ధారించారు. విరాట్ కోహ్లీ 30 కోట్లు డొనేట్ చేసినట్లు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వార్తల్లోనూ నిజం లేదని ఒడిశా పోలీసులు తెలిపారు. ఫేక్ ట్వీట్లతో రైలు ప్రమాద ఘటన పట్ల మతం కోణాన్ని జోడిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫేక్ మెసేజ్లను ఎవరూ ఫార్వర్డ్ చేయవద్దు అని పోలీసులు తె లిపారు. వదంతులు వ్యాపించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.