Dhruv Jurel: త్వరలో స్వదేశంలో ఇంగ్లండ్తో జరగాల్సి ఉన్న ఐదు మ్యాచ్ల సిరీస్కు గాను సెలక్టర్లు తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉత్తరప్రదేశ్కు చెందిన యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ను ఎంపికచేసిన విషయం తెలిసిందే. 22 ఏండ్ల ఈ యువ ఆటగాడు దేశవాళీతో పాటు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫునే గాక ఇండియా ‘ఎ’ తరఫున దుమ్మురేపుతున్నాడు. ఇటీవల కాలంలో దేశవాళీలోనూ నిలకడగా ఆడుతున్న జురెల్.. భారత జట్టులో చోటు దక్కించుకోవడంపై ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఈ విషయం తెలియగానే తన కుటుంబం మొత్తం షాక్లో ఉన్నదని, తన తండ్రి అయితే తాను ఏ ఇండియా టీమ్కు సెలక్ట్ అయ్యావని ఆసక్తికరంగా అడిగినట్టు తెలిపాడు.
సెలక్టర్లు జట్టును ప్రకటించిన తర్వాత జురెల్ మాట్లాడుతూ… ‘‘ఈ విషయం (టీమిండియాకు సెలక్ట్ అవడం) మా నాన్నకు చెప్పగానే ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ‘నువ్వు ఏ ఇండియా టీమ్కు సెలక్ట్ అయ్యావ్’ అని మరోసారి కన్ఫమ్ చేసుకున్నాడు. అప్పుడు నేను రోహిత్ భయ్యా, విరాట్ భయ్యా ఆడే టీమ్కు సెలక్ట్ అయ్యా అని చెప్పా. నా కుటుంబం మొత్తానికి ఇది అత్యంత బావోద్వేగమైన సందర్భం..‘’ అని చెప్పుకొచ్చాడు.
Dhruv Jurel said “My mother sold her only gold chain she had to buy my first cricket kit, my parents are truly my inspiration”. [Jagran News/Abhishek Tripathi] pic.twitter.com/2M0VvUBk58
— Johns. (@CricCrazyJohns) January 13, 2024
రోహిత్, కోహ్లీ వంటి సీనియర్లతో పాటు రాహుల్ ద్రావిడ్ వంటి దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోనుండటం తనకు కలలా ఉందని జురెల్ అన్నాడు. ‘ఇండియన్ టీమ్కు సెలక్ట్ అయినందుకు నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. రోజూ నేను హీరోలుగా ఆరాధించేవారితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోబోతున్నాను. ఇది నాకు పూర్తిగా కొత్తది. కచ్చితంగా వారి దగ్గర్నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటా…’ అని జురెల్ తెలిపాడు. భారత్ – ఇంగ్లండ్ మధ్య జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు జరుగనుంది.
తొలి రెండు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, కెఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రిత్ బ బుమ్రా, అవేశ్ ఖాన్