దుబాయ్: ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో ఒక దృశ్యం అందరినీ ఆకర్షించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో నాలుగు ఓవర్ల ఆట ముగిసినప్పుడు సైట్ స్క్రీన్ సమస్య కారణంగా ఆటకు కొంత విరామం ఇచ్చారు.
ఆ సమయంలో బౌండరీ లైన్ పక్కనే భారత యువ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ రిషభ్ పంత్కు ధోనీ పాఠాలు చెప్తూ కనిపించాడు. ఆట ఆగడంతో కెమెరాలు వీరిపై ఫోకస్ పెట్టాయి. ఒక వికెట్ను మధ్యలో ఉంచి, బంతి విసురుతూ ధోనీ కనిపించాడు. వికెట్కు తగిలిన బంతిని ఒడిసి పట్టే పనిలో పంత్ బిజీగా ఉన్నాడు.
ఈ వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న భారత జట్టుకు మెంటార్గా ధోనీ నియమితుడైన సంగతి తెలిసిందే. జట్టుపై ధోనీ సానుకూల ప్రభావం చూపుతాడని అభిమానులు భావిస్తున్నారు.