బాంకాక్: తెలుగు కుర్రాడు ధీరజ్ బొమ్మదేవర ఆర్చరీలో భారత్కు తొలి ఒలింపిక్ బెర్త్ను ఖాయం చేశాడు. ఆసియన్ కాంటినెంటల్ అర్హత టోర్నీలో ధీరజ్ రజత పతకం సాధించడం ద్వారా ఆర్చరీలో భారత్కు తొలి ఒలింపిక్ బెర్త్ను అందించాడు.
ఈ టోర్నీలో ఫైనల్కు చేరిన ఇద్దరికి ఒలింపిక్స్ బెర్త్లు లభించనున్న నేపథ్యంలో ఫైనల్కు చేరిన ధీరజ్ 5-6 తేడాతో చైనీస్ తైపీ ఆర్చర్ జిహ్ సియాంగ్ లింగ్ చేతిలో ఓడి రజతంతో సంతృప్తి చెందాడు. అంతకుముందు ధీరజ్ క్వార్టర్ఫైనల్లో ఇరాన్కు చెందిన సదేగ్ అష్రఫ్ బావిలిపై 6-0తో, సెమీస్లో మరో ఇరానియన్ ఆర్చర్ మొహ్మదొసీన్ గోల్షానిపై 6-0తో గెలుపొందాడు.