IPL 2024 RCB vs PBKS ఐపీఎల్ పదిహేడో సీజన్ ఆరో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) 176 పరుగులు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) బౌలర్ల ధాటికి భారీ స్కోర్ కొట్టలేకపోయింది. కెప్టెన్ శిఖర్ ధావన్(45), జితేశ్ శర్మ(27), సామ్ కరన్(23) లు బ్యాట్ ఝులిపించారు.
ఆఖరి ఓవర్లో శశాంక్ సింగ్(21 నాటౌట్) రెండు సిక్సర్లు, ఫోర్ బాదాడంతో పంజాబ్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్వెల్లు తలా రెండేసి వికెట్లు పడగొట్టగా జోసెఫ్ ఒక వికెట్ తీశాడు.
Innings Break!
20 runs from the final over powers @PunjabKingsIPL to 176/6 🔥
Will it be enough or @RCBTweets will chase this down?
Scorecard ▶️ https://t.co/cmauIj3e0o#TATAIPL | #RCBvPBKS pic.twitter.com/QdlgTDD2vk
— IndianPremierLeague (@IPL) March 25, 2024
టాస్ ఓడిన పంజాబ్ను సిరాజ్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. వరుసగా రెండు బౌండరీలు బాదిన జానీ బెయిర్స్టో(8) మూడో బంతికి ఔట్ చేశాడు. దాంతో, 17 పరుగుల వద్ద పంజాబ్ మొదటి వికెట్ పడింది. ఆ తర్వాత ప్రభ్సిమ్రాన్ సింగ్(25), ధావన్(45)లు ఇన్నింగ్స్ను చక్కదిద్దారు.
Back to Back wickets for @RCBTweets ❤️#PBKS lose both set batters in the form of Liam Livingstone & Shikhar Dhawan.
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvPBKS pic.twitter.com/GKhnsCWruQ
— IndianPremierLeague (@IPL) March 25, 2024
అయితే.. మ్యాక్స్వెల్ తన స్పిన్ మాయతో ఈ ఇద్దరినీ వెనక్కి పంపాడు. తొలి మ్యాచ్ హీరో లివింగ్స్టోన్(17)ను అల్జారీ జోసెఫ్ బోల్తా కొట్టించాడు. 98 పరుగులకే 4 వికెట్లు పడిన జట్టును సామ్ కరన్(23).. జితేశ్ శర్మ(27)లు ఆదుకున్నారు. వీళ్లు ఐదో వికెట్కు 52 రన్స్ జోడించారు. ఆ తర్వాత దయాల్, సిరాజ్ పొదుపుగా బౌలింగ్ చేసినా.. జోసెఫ్ వేసిన ఆఖరి ఓవర్లో శశాంక్ సింగ్(21 నాటౌట్) రెండు సిక్సర్లు, ఫోర్ బాదాడు. ఆఖరి బంతికి సింగిల్ వచ్చిందదే. దాంతో, పంబాజ్ పోరాడగలిగే స్కోర్ చేసింది.