కారేపల్లి రూరల్, మే 7: విపత్కర పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారని, రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయించారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. విశాల పరపతి సంఘం ఆధ్వర్యంలో విశ్వనాథపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్ కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే వారికి అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని అన్నారు.
ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం
మోకాళ్ల రామయ్యగుంపులో రూ.3.50 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను, వీధిలైట్లను ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ శుక్రవారం ప్రారంభించారు. గ్రామానికి త్వరలోనే రహదారి సౌకర్యం, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, కారేపల్లి సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీ మాళోతు శకుంతల, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మల్లెల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, అజ్మీరా వీరన్న, పెద్దబోయిన ఉమాశంకర్, అడ్డగోడ ఐలయ్య, బానోతు కిశోర్ పాల్గొన్నారు.