ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్
బెంగళూరు: ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా గేమ్స్లో తెలంగాణ పతక బోణీ అదిరింది. సోమవారం జరిగిన పురుషుల 81 కిలోల వెయిట్లిఫ్టింగ్లో ఉస్మానియా యూనివర్సిటీ తరఫున బరిలోకి దిగిన ధనావత్ గణేశ్ రజత పతకంతో మెరిశాడు. జాతీయ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి ఖేలో ఇండియాలో సత్తాచాటాడు.
స్నాచ్లో 120 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్లో 155 కిలోలు మొత్తంగా 275 బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. రాగాల వరుణ్(స్నాచ్లో 127కి + క్లీన్ అండ్ జెర్క్లో 150కి) స్వర్ణం దక్కించుకోగా, గణేశ్ బయకర్(స్నాచ్లో 114కి + క్లీన్ అండ్ జెర్క్లో 161కి) కాంస్యం దక్కించుకున్నాడు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థులు గణేశ్, వరుణ్ పతకాలు సాధించడంపై వెయిట్లిఫ్టింగ్ కోచ్ మాణిక్యాలరావు సంతోషం వ్యక్తం చేశాడు.