గాలె: మిడిలార్డర్ ఆటగాడు ధనంజయ డిసిల్వ (153 బ్యాటింగ్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ సెంచరీతో చెలరేగడంతో వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఆధిక్యం దిశగా సాగుతున్నది. ఓవర్నైట్ స్కోరు 46/2తో గురువారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక.. ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. నిషాంక (66) హఫ్సెంచరీ సాధించాడు. విండీస్ బౌలర్లలో వీరసామి పెరుమాల్ 3, రోస్టన్ చేజ్ రెండు వికెట్లు పడగొట్టారు. శుక్రవారం ఆటకు ఆఖరి రోజు కాగా.. చేతిలో రెండు వికెట్లు ఉన్న లంక.. ప్రస్తుతం 279 పరుగులు ఆధిక్యంలో ఉంది. శుక్రవారం లంక ఇంకెన్ని పరుగులు చేసి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగిస్తుందో చూడాలి.