అహ్మాదాబాద్: ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ మ్యాచ్(IND Vs AUS)కు ఫుల్ ప్రిపరేషన్ నడుస్తోంది. మ్యాచ్ ఆరంభానికి ముందు సూర్యకిరణ్ హెలికాప్టర్లతో ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఇక డ్రింక్స్ బ్రేక్ సమయంలో లేజర్ షో ఉండనున్నది. అయితే ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని, రక్షణ శాఖ మంత్రి రిచర్డ్ మారెల్స్ హాజరుకానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభంకానున్నది. ఈ మ్యాచ్కు ప్రధాని మోదీ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.