IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ను ఓటమితో ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు గుడ్న్యూస్. ఆ జట్టు స్టార్ పేసర్ అన్రిచ్ నార్జ్ (Anrich Nortje) భారత్లో అడుగుపెట్టాడు. నిరుడు గాయాల కారణంగా సీజన్ మొత్తానికి దూరమైన నార్జ్ సోమవారం ఢిల్లీ జట్టుతో కలిశాడు. ఇషాంత్ శర్మ(Ishant Sharma) గాయపడడంతో ఆందోళనలో పడిన పంత్ సేనకు నార్జ్ రాకతో నోట్లో చక్కెర పోసినట్టయింది. దాంతో, టీమ్ హోట్లో అతడికి ఘన స్వాగతం లభించింది.
దక్షిణాఫ్రికా ప్రధాన పేసర్ అయిన నార్జ్ నిరుడు గాయపడ్డాడు. దాంతో, వన్డే వరల్డ్ కప్తో పాటు టీమిండియా సిరీస్కు సైతం దూరమయ్యాడు. ఈ మధ్యే కోలుకున్న నార్జ్ స్వదేశంలో మూడు టీ20 మ్యాచ్లు ఆడి తన ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. అయితే.. ఐపీఎల్లో ఢిల్లీ తొలి మ్యాచ్ సమయానికి అతడు భారత్కు రాలేపోయాడు.
ఐపీఎల్ 17వ సీజన్తో రిషభ్ పంత్ పునరగామనం చేశాడు. పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో జరిగిన తొలి మ్యాచ్లో 18 పరుగులే చేసినా స్టంపింగ్తో ఆకట్టుకున్నాడు. అయితే.. 174 పరుగుల ఛేదనలో పంజాబ్ అద్భుత విజయం సాధించింది. రెండో మ్యాచ్లో మార్చి 28న మంగళవారం రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ‘హోలీ’ సందర్భంగా ఢిల్లీ ఆటగాళ్లు రంగుల్లో మునిగి తేలారు. కెప్టెన్ రిషభ్ పంత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్లు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు.