ఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ఊరట లభించింది. గతంలో తన మాజీ భార్య అయేషా ముఖర్జీకి చెల్లించిన రూ. 5.7 కోట్లను ధావన్ ఖాతాలో జమచేయాలని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆస్ట్రేలియా పౌరసత్వం కల్గిన అయేషాతో ధావన్ 2023లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే గతంలో అక్కడి కోర్టులో ప్రాపర్టీ సెటిల్మెంట్ కోసం దాఖలు చేసిన పిటిషన్లో ధావన్.. ఆ దేశ చట్టాలననుసరించి ఆమెకు రూ. 5.7 కోట్లు బదిలీ చేశాడు. కాగా దీనిపై ఈ ఢిల్లీ ఓపెనర్ గత కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తున్నాడు. తాజాగా కోర్టు.. అతడికి పూర్తి నగదుతో పాటు ధావన్ కేసు దాఖలు చేసినప్పట్నుంచీ 9 శాతం వార్షిక వడ్డీని జమచేసి చెల్లించాలని అయేషాను ఆదేశించింది.