Mumbai Vs Delhi | ముంబై ఇండియన్స్ (ఎంఐ) బౌలర్లు ఆచితూచి బౌలింగ్ చేయడంతో ఢిల్లీ జట్టులో టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 11 ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 64పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా, డేవిడ్ బార్మర్లతోపాటు మిచెల్ మార్ష్ను పెవిలియన్కు సాగనంపడంలో జస్ప్రీత్ బుమ్రా కీలకంగా వ్యవహరించారు. పృథ్వీషా 24 పరుగులు చేసి.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఇషాన్ కిషాన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
డానియల్ శామ్స్ బౌలింగ్లో డేవిడ్ బార్మర్ కొట్టిన బంతిని బుమ్రా క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. ఔటయ్యే సమయానికి డేవిడ్ బార్మర్ కేవలం ఐదు పరుగులే చేశాడు. మిచైల్ మార్ష్ డకౌట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ పట్టడంతో మార్ష్ వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీ సారధి రిషబ్ పంత్ పది పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సర్పరాజ్ ఖాన్ 10 పరుగులు చేసి, మయాంక్ బౌలింగ్లో ఇషాన్ కిషాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. అంతకుముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకున్నది.