మెల్బోర్న్: కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇన్నాళ్లు క్రికెట్కు దూరమైన రిషబ్ పంత్..రానున్న ఐపీఎల్కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండబోతున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ చీఫ్ కోచ్ పాంటింగ్ బుధవారం పేర్కొన్నాడు.
‘ఢిల్లీ తరఫున వచ్చే సీజన్లో బరిలోకి దిగేందుకు పంత్ సిద్ధంగా ఉన్నాడు. అతను ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. ఏ బాధ్యతలో ఆడుతాడన్నది ఇంకా తెలియదు’ అని అన్నాడు.