అద్భుత విజయాలతో సెమీఫైనల్కు చేరిన దీపక్ పునియా.. కీలక పోరులో పరాజయం పాలయ్యాడు. 86 కేజీల సెమీస్లో డావిడ్ మారిస్ టేలర్ (అమెరికా) చేతిలో దీపక్ ఓడాడు. ‘టెక్నికల్ సుపీరియారిటీ’ ద్వారా టేలర్ను విజేతగా ప్రకటించారు. కాంస్య పతక పోరు కోసం దీపక్ గురువారం బరిలో దిగనున్నాడు. మహిళల విభాగంలో బరిలోకి దిగిన అన్షు మాలిక్ (57 కేజీలు) తొలి రౌండ్లో ఇరీనా కురచికినా (బెలారస్) చేతిలో ఓడింది. అయితే ఇరీనా ఫైనల్ చేరడంతో రెపిచేజ్ రౌండ్లో గురువారం మరోసారి అన్షు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.