హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఫ్రెండ్షిప్ కప్ టెన్నిస్ టోర్నీలో దీపక్ గోయల్-విజయ్ అగర్వాల్ జంట విజేతగా నిలిచింది. ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్లో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో దీపక్-విజయ్ జోడీ 8-5తో చంద్రశేఖర్-అజయ్ రాయ్ ద్వయంపై విజయం సాధించింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్సేన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫతేమైదాన్ క్లబ్ కమిటీ సభ్యులు విజయ్ రాజ్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.