ముంబై: ఐపీఎల్ రెండో మ్యాచ్లో చెన్నై బౌలర్ దీపక్ చహర్ చెలరేగుతున్నాడు. అతడు నాలుగు వికెట్లు తీయడంతో పంజాబ్ కింగ్స్లో 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటికే మయాంక్ (0), రాహుల్ (5), గేల్ (10), పూరన్ (0)లాంటి స్టార్ బ్యాట్స్మెన్ పెవిలియన్ చేరారు. దీపక్ చహర్ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం విశేషం.