ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ కకావికలమైంది. గత మ్యాచ్లో అద్భుతంగా రాణించిన శిఖర్ ధావన్ (9) స్వల్పస్కోరుకే వెనుతిరగ్గా.. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (24) తనకు దక్కిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత భారీ అంచనాలు పెట్టుకున్న లియామ్ లివింగ్స్టన్ (2)ను అక్షర్ పటేల్ బోల్తాకొట్టించాడు.
అక్షర్ వేసిన బంతిని ముందుకొచ్చి భారీ షాట్ ఆడేందుకు లివింగ్స్టన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతిని పూర్తిగా మిస్ అయ్యాడు. దాన్ని అందుకున్న పంత్ వికెట్లను పడగొట్టడంతో లివింగ్స్టన్ ఇన్నింగ్స్ ముగిసింది. పవర్ప్లే ముగిసే సరికి పంజాబ్ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. క్రీజులో జానీ బెయిర్స్టో (9 నాటౌట్), జితేష్ శర్మ ఉన్నారు.