ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్కు తొలి ఎదురు దెబ్బ. లలిత్ యాదవ్ వేసిన నాలుగో ఓవర్లో ఫామ్లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధవన్ (9) అవుటయ్యాడు. లలిత్ వేసిన లెంగ్త్ బాల్ను వెనుక వైపుకు కొట్టేందుకు ధవన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మంచి ఆటతీరు కనబరుస్తున్నాడు. ఈ క్రమంలో 33 పరుగుల వద్ద పంజాబ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది.