చివరి మ్యాచ్లో ఓటములు చవిచూసిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండు జట్లూ ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి. ఐపీఎల్ 2022లో భాగంగా జరుగుతున్న 32వ మ్యాచ్లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ టాస్ గెలిచాడు. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన మిచెల్ మార్ష్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ను తీసుకున్నట్లు పంత్ వెల్లడించాడు.
అదే సమయంలో పంజాబ్ జట్టులో రెండు మార్పులు జరిగినట్లు మయాంక్ తెలిపాడు. గత మ్యాచ్కు దూరమైన మయాంక్ తిరిగి రావడంతో ప్రభ్సిమ్రాన్ సింగ్ బెంచ్కే పరిమితం కానున్నాడు. అలాగే ఒడియన్ స్మిత్ స్థానంలో నాథన్ ఎలిస్కు అవకాశం ఇచ్చినట్లు మయాంక్ తెలిపాడు.
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్స్టో, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్షదీప్ సింగ్, నాథన్ ఎలిస్
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్ (కెప్టెన్), రోవ్మెన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్.
🚨 Toss Update 🚨@DelhiCapitals have elected to bowl against @PunjabKingsIPL.
Follow the match ▶️ https://t.co/3MYNGBm7Dg#TATAIPL | #DCvPBKS pic.twitter.com/i7EttsbTlp
— IndianPremierLeague (@IPL) April 20, 2022