కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న పంజాబ్ను కుల్దీప్ యాదవ్ మరోసారి దెబ్బ కొట్టాడు. 14వ ఓవర్లో బంతి అందుకున్న అతను.. ఒకే ఓవర్లో రబాడ (2), నాథన్ ఎలిస్ (0)ను వెనక్కు పంపాడు. కుల్దీప్ వేసిన బంతిని డిఫెండ్ చేసుకోవడానికి రబాడ ప్రయత్నించగా.. అతని డిఫెన్స్ విఫలమవడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత నాథన్ ఎలిస్ కూడా బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. దీంతో పంజాబ్ జట్టు 90 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆ తర్వాతి ఓవర్లోనే ఖలీల్ అహ్మద్ కూడా సత్తా చాటాడు. షారుఖ్ ఖాన్ (12)ను అవుట్ చేశాడు. ఖలీల్ వేసిన బంతిని ఆడేందుకు ప్రయత్నించిన షారుఖ్ ప్రయత్నం విఫలమై.. ఎడ్జ్ తీసుకున్న బంతిని పంత్ సులభంగా అందుకున్నాడు. దాంతో పంజాబ్ పోరాడగలిగే స్కోరు చేయడానికి ఉన్న ఒకే ఒక ఆశ కూడా పోయినట్లయింది. పంజాబ్ అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. 92 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టు ఏమాత్రం స్కోరు చేస్తుందో చూడాలి.