బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ జట్టును అత్యల్ప స్కోరుకే కట్టడి చేసిన ఢిల్లీ క్యాపిటల్స్కు.. ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం అందించారు. డేవిడ్ వార్నర్ (18 బంతుల్లోనే 36 నాటౌట్), పృథ్వీ షా (18 బంతుల్లో 40 నాటౌట్) ఇద్దరూ దంచి కొడుతున్నారు.
వీళ్లిద్దరూ బౌండరీలతో విరుచుపడటంతో పంజాబ్ బౌలర్లు విలవిల్లాడుతున్నారు. ఓపెనర్లు ఇద్దరూ అద్భుతంగా ఆడటంతో పవర్ప్లే ముగిసే సరికి ఢిల్లీ జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. ఢిల్లీ విజయానికి ఇంకో 35 పరుగులు చేస్తే చాలు.