కోల్కతా బౌలర్లను దంచి కొడుతున్న ఢిల్లీ మరో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రిషభ్ పంత్ (27) మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది. ఆండ్రీ రస్సెల్ వేసిన 13వ ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పంత్.. థర్డ్ మ్యాన్కు చిక్కాడు. ఆఫ్స్టంప్నకు ఆవల వేసిన షార్ట్ బంతిని సిక్సర్ కొట్టేందుకు పంత్ ప్రయత్నించాడు.
కానీ అది కుదరకపోవడంతో బంతి గాల్లో ఎత్తుగా లేచి థర్డ్మ్యాన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఉమేష్ యాదవ్ చేతుల్లో పడింది. దాంతో పంత్ ఇన్నింగ్స్ ముగిసింది. 13 ఓవర్లలో 148 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఢిల్లీ.