చెన్నై: రంజాన్ నెలను ముస్లింలు ఎంత పవిత్రంగా భావిస్తారో తెలుసు కదా. నెల రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి వరకూ పచ్చి మంచి నీళ్లు కూడా తాగకుండా కఠిన ఉపవాసం చేస్తారు. అయితే ఈసారి రంజాన్ నెల ఐపీఎల్ జరిగే సమయంలోనే వచ్చింది. అయినా కూడా కొందరు ముస్లిం క్రికెటర్లు ఉపవాసం చేస్తుండటం విశేషం.
ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్లో ముస్లిం క్రికెటర్ల సంఖ్య ఎక్కువే. స్టార్ స్పిన్నర్ రషీద్ఖాన్తోపాటు ముజీబుర్ రెహమాన్, మహ్మద్ నబీ, ఖలీల్ అహ్మద్లు రంజాన్ ఉపవాసం చేస్తున్నారు. అయితే విచిత్రమేమిటంటే వీళ్లతోపాటు టీమ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ కూడా ఒక రోజు ఉపవాసం ఉన్నారు.
ఉపవాసం విడిచే సమయంలో హోటల్లో తినడానికి సిద్ధంగా కూర్చున్న వార్నర్, విలియమ్సన్ల గురించి చెబుతూ రషీద్ ఖాన్ ఇన్స్టాలో షేర్ చేసిన వీడియో వైరల్ అయింది. ఉపవాసం ఎంత కష్టమో ఈ వీడియోలో వార్నర్, విలియమ్సన్ చెప్పారు. సాటి క్రికెటర్లకు తోడుగా వీళ్లు ఉపవాసం చేయడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఎంతో మంది వీళ్లను అభినందిస్తూ కామెంట్స్ చేశారు.
టార్గెట్ టీ20 వరల్డ్కప్.. రిటైర్మెంట్ నుంచి బయటకు వస్తానన్న ఏబీడీ
షాకింగ్.. కనీసం సగం మంది కరోనా యోధులకూ అందని వ్యాక్సిన్
కరోనా బారిన పడి కోలుకున్న వారికి ఒక్క డోసు వ్యాక్సిన్ చాలు!
ముత్తయ్య మురళీధరన్కు యాంజియోప్లాస్టీ
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..!
దేశంలో కరోనా కరాళ నృత్యం.. 24 గంటల్లో భారీగా కొత్త కేసులు
రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా కేసులు