అహ్మాదాబాద్: ఐపీఎల్(IPL) 2023 సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్కు అంతా సిద్దమైంది. అయితే గుజరాత్ జట్టుకు కీలక ప్లేయర్ మిస్సవుతున్నాడు. గత సీజన్లో కీ రోల్ ప్లే చేసిన సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్(David Miller).. ఇవాళ్టి మ్యాచ్కు అందుబాటులో ఉండడం లేదు. నెదర్లాండ్తో సౌతాఫ్రికా జట్టు వన్డే సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఇంకా ఐపీఎల్ జట్టుతో ఆ ప్లేయర్ జాయిన్ కాలేదు. ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత మిల్లర్ .. గుజరాత్ జట్టుతో చేరే అవకాశాలు ఉన్నాయి.
𝐓𝐡𝐞 #𝐓𝐀𝐓𝐀𝐈𝐏𝐋 𝟐𝟎𝟐𝟑 𝐒𝐭𝐚𝐫𝐭𝐬 𝐓𝐨𝐝𝐚𝐲!
Home & away challenge, interesting new additions and the return of packed crowds 🙌🏻
Hear from the captains ahead of an incredible season 👏🏻👏🏻 – By @Moulinparikh
WATCH the Full Video 🎥🔽 https://t.co/BaDKExCWP1 pic.twitter.com/jUeTXNnrzU
— IndianPremierLeague (@IPL) March 31, 2023
ధోనీ నేతృత్వంలోని చెన్నై(Chennai Super Kings) జట్టు.. హార్ధిక్ ప్యాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ జట్టు(Gujarat Titans)తో తలపడనున్నది. అయితే ఈసారి టోర్నీకి కొంత మంది సౌతాఫ్రికా ప్లేయర్లు ఆలస్యం హాజరుకానున్నారు. మిల్లర్తో పాటు ఆ జాబితాలో డీకాక్, రబడ, ఎంగిడి, మార్క్రమ్లు కూడా ఉన్నారు. వీళ్లంతా జాతీయ జట్టుకు ఆడుతున్నారు. దీంతో వాళ్ల రాక ఆలస్యం కానున్నది. చెన్నై జట్టు ఇప్పటికే నాలుగుసార్లు టోర్నీ వశం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక గుజరాత్ మాత్రం ఒక్క సారి మాత్రమే చాంపియన్గా నిలిచింది.
Lights 💡
Camera 📸
Action 🔜⏳@tamannaahspeaks & @iamRashmika are geared up for an exhilarating opening ceremony of #TATAIPL 2023 at the Narendra Modi Stadium 🏟️🎇 pic.twitter.com/wAiTBUqjG0— IndianPremierLeague (@IPL) March 30, 2023
ఈసారి అన్ని జట్లు హోం గ్రౌండ్లో ఆడనున్నాయని, అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ స్థాయి మరోలా ఉంటుందని కేకేఆర్ జట్టు కెప్టెన్ నితీశ్ రాణా అన్నారు. ప్రతి ప్లేయర్కు బెస్ట్ విషెస్ చెప్పారు పంజాబ్ కెప్టెన్ ధావన్. కెప్టెన్లు తమ అభిప్రాయాలు వెల్లడించిన వీడియోను ఐపీఎల్ తన ట్విట్టర్లో పోస్టు చేసింది.