పుణె: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) నాలుగో సీజన్లో దబాంగ్ ఢిల్లీ, చెన్నై లయన్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. బుధవారం జరిగిన పోరులో ఢిల్లీ 9-6తో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై లయన్స్పై అద్భుత విజయం సాధించింది.
దీంతో ఢిల్లీ(42), చెన్నై(41) సెమీస్కు అర్హత సాధించాయి. పురుషుల సింగిల్స్లో సాతియాన్ 11-10, 11-3, 11-6తో శరత్కమల్ను చిత్తుచేశాడు. మహిళల సింగిల్స్లో ఆకుల శ్రీజ 8-11, 11-8, 8-11తో యాంగ్జీ లియు చేతిలో ఓడింది.