టోక్యో: టోక్యో ఒలింపిక్స్లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. చెక్ రిపబ్లిక్కు చెందిన బీచ్ వాలీబాల్ ప్లేయర్ ఆండ్రెజ్ పెరూసిక్కు కరోనా వైరస్ సంక్రమించింది. ఒలింపిక్ విలేజ్లో ఉంటున్న అతనికి పాజిటివ్ వచ్చినట్లు ఆ దేశ ఒలింపిక్ కమిటీ పేర్కొన్నది. ఒలింపిక్ విలేజ్లో ఉంటున్న ఇద్దరు దక్షిణాఫ్రికా ఫుట్బాల్ ప్లేయర్లు, మరో అనలిస్టు కూడా వైరస్ సోకిన విషయం తెలిసిందే. చెక్ ప్లేయర్ పెరూసిక్కు ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేవని టీమ్ హెడ్ తెలిపారు. మిగితా సభ్యుల్లో ఎవరికీ వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెక్ ఒలింపిక్ కమిటీ హెడ్ మార్టిన్ తెలిపారు. ఒలింపిక్ విలేజ్లో ఉన్న అపార్ట్మెంట్లు, భోజన ప్రదేశాల్లో సుమారు 6700 మంది అథ్లెట్లు బస చేయనున్నారు. శుక్రవారం నుంచి మహాక్రీడలు ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.