తొలిసారి కామన్వెల్త్ గేమ్స్లో మహిళల టీ20 క్రికెట్ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో భారత మహిళల జట్టు శుక్రవారం నాడు ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత్కు షాక్ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్, బ్యాటర్ ఎస్ మేఘన ఇద్దరూ కరోనా బారిన పడ్డారు.
కామన్వెల్త్ గేమ్స్కు ముందు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణా శిబిరంలో పాల్గొన్న మహిళల జట్టులో వీళ్లిద్దరికీ కరోనా సోకినట్లు భారత ఒలింపిక్ సంఘానికి చెందిన అధికారులు ధ్రువీకరించారు. వీళ్లిద్దరూ కరోనా నెగిటివ్ అని తేలిన తర్వాతనే జట్టుతో కలుస్తారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అంటే ఆస్ట్రేలియాతో ఆడే సిరీస్ ఓపెనర్లో వీళ్లిద్దరూ జట్టుకు అందుబాటులో ఉండరు.
ఈ నెల 31న దాయాది దేశం పాకిస్తాన్తో భారత్ మ్యాచ్ ఆడనుంది. ఆ సమయానికైనా వీళ్లు జట్టుతో కలుస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మెగా టోర్నీలోని మ్యాచులన్నీ ఎడ్జ్బాస్టన్ వేదికగానే జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. అలాగే సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడుపోయినట్లు వెల్లడించారు.