టేబుల్ టెన్నిస్లో వెటరన్ ప్లేయర్ శరత్ కమల్ మరోసారి సత్తాచాటాడు. నలభై ఏళ్ల వయసులో కూడా తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపిస్తూ కామన్వెల్త్ గేమ్స్లో మరో స్వర్ణం తన ఖాతాలో వేసుకున్నాడు. టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన శరత్.. ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ పిచ్ఫోర్డ్ను ముప్పుతిప్పలు పెట్టాడు.
ఐదు గేమ్స్లో వరుసగా 11-13, 11-7, 11-2, 11-6, 11-8 పాయిట్లతో నెగ్గాడు. తొలి గేమ్లో ఆధిక్యం సాధించిన లియామ్.. ఆ తర్వాత ఏ దశలోనూ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాడు. దీంతో ఐదింట నాలుగు గేమ్స్ నెగ్గిన శరత్.. మ్యాచ్తోపాటు పసిడి పతకాన్ని కూడా తన సొంతం చేసుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో ఈ సీనియర్ ప్లేయర్కు ఇది ఏడో స్వర్ణం కావడం గమనార్హం.
పురుషుల సింగిల్స్లో ఇప్పటి వరకు రెండు స్వర్ణాలు (2018, 2022) నెగ్గిన శరత్.. 2006, 2018, 2022ల్లో మూడుసార్లు పురుషులు టీం విభాగంలో పసిడి పతకం సాధించాడు. అలాగే 2010లో పురుషుల డబుల్స్లో, 2022లో మిక్స్డ్ డబుల్స్ కూడా బంగారు పతకం తన కైవసం చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు శరత్ ఖాతాలో మొత్తమ్మీద ఏడు కామన్వెల్త్ స్వర్ణాలు ఉన్నాయన్నమాట.
🏓🥇 𝗚𝗢𝗟𝗗 𝗙𝗢𝗥 𝗧𝗛𝗘 𝗜𝗖𝗢𝗡! Sharath Kamal wins the gold medal in the Men's Singles event at the CWG after 1️⃣6️⃣ years.
👏 He has won a medal in every event that he has taken part in #B2022!
📸 Getty • #SharathKamal #TableTennis #B2022 #CWG2022 #TeamIndia #BharatArmy pic.twitter.com/8bJUhl5d9p
— The Bharat Army (@thebharatarmy) August 8, 2022