కామన్వెల్త్ క్రీడల్లో ప్రపంచ పంచింగ్ రాణి నిఖత్ జరీన్ క్వార్టర్స్ చేరింది. 50 కేజీల ఫ్లైవెయిట్ విభాగంలో బరిలో దిగిన నిఖత్.. మొజాంబిక్కు చెందిన హెలెనా ఇస్మాయిల్ బగావోపై విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి హెలెనా ఆధిపత్యం చెలాయించింది.
అయితే నిఖత్ తన అనుభవంతో హెలెనాపై పైచేయి సాధించింది. వెనక్కు తగ్గినట్లే కనిపించిన ఆమె ఆ తర్వాత హెలెనాపై ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో నిఖత్ జరీన్ తన ప్రత్యర్థి మొఖంపై క్లీన్ హిట్ ల్యాండ్ చేసింది. దీంతో హెలెనా ఉక్కిరిబిక్కిరైంది.
అది చూసిన రిఫరీ మరో 48 సెకన్లు ఉండగానే మ్యాచ్ ముగించారు. తన తర్వాతి మ్యాచ్లో న్యూజిల్యాండ్కు చెందిన ట్రాయ్ గార్టాన్ను ఎదుర్కొంటుంది. అదే సమయంలో మరో భారత బాక్సర్ శివ థాప.. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ కాంస్య పతక విజేత, స్కాట్లాండ్ బాక్సర్ రీస్ లించ్తో జరిగిన మ్యాచ్లో 1-4 తేడాతో థాప ఓటమి చవిచూశాడు.