ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే భారత థ్లెట్ సందీప్ కుమార్ కూడా రాణించాడు. ఇక్కడ జరిగిన పది వేల మీటర్ల నడక రేస్లో పాల్గొన్న ఈ 36 ఏళ్ల క్రీడాకారుడు.. తన వ్యక్తిగత రికార్డును బద్దలుకొట్టి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు.
ఇంతకుముందు ఈ పదివేల మీటర్ల రేస్ను పూర్తిచేయడానికి సందీప్కు 46:55.97 సెకన్లు పట్టింది. ఇదే అతని బెస్ట్ టైమింగ్. అయితే బర్మింగ్హామ్లో మరింత పట్టుదల ప్రదర్శించిన సందీప్.. తన రేస్ను 38:49.21 సెకన్లలోనే పూర్తిచేసి కాంస్యం సాధించాడు. మరోవైపు మహిళల పది వేల మీటర్ల రేస్ వాక్లో భారత క్రీడాకారిణి ప్రియాంకా గోస్వామి రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే.