బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత జూడోకాలు సత్తాచాటారు. జూడోలో సుశీలా దేవి అద్భుతంగా రాణించింది. అయితే ఫైనల్లో సౌతాఫ్రికాకు చెందిన మైకేలా వైట్బూయ్తో జరిగిన మ్యాచ్లో పోరాడి ఓడిన సుశీల.. రెండో స్థానం సాధించింది. ఈ క్రమంలోనే 27 ఏళ్ల ఆమెకు సిల్వర్ మెడల్ అందింది. 48 కేజీల విభాగంలో పాల్గొన్న సుశీల.. గతంలో అంటే 2014 కామన్వెల్త్ క్రీడల్లో కూడా రజతం సాధించింది.
ఇలా రెండు సార్లు కామన్వెల్త్ క్రీడల్లో జూడోలో మెడల్స్ సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది. అదే సమయంలో మరో భారత జూడోక విజయ్ కుమార్ యాదవ్ కూడా రాణించాడు. పురుషుల 60 కేజీల విభాగంలో సత్తాచాటిన విజయ్.. కాంస్య పతకం సాధించాడు.