బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు మరో పతకం దక్కింది. వెయిట్లిఫ్టర్ హర్జీందర్ కౌర్ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 71 కేజీల విభాగంలో తలపడిన ఆమె.. మొత్తం 212 కేజీల బరువు ఎత్తింది. స్నాచ్లో 93 కేజీలు ఎత్తిన ఆమె.. క్లీన్ అండ్ జర్క్లో 119 కేజీలు ఎత్తి కాంస్య పతకం సాధించింది. కాగా, ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు ఇప్పటి వరకు మొత్తం 9 పతకాలు దక్కగా.. వాటిలో ఏడు పతకాలు వెయిట్లిఫ్టింగ్లోనే రావడం గమనార్హం.