భారత జావెలిన్ త్రో అథ్లెట్ అన్ను రాణి చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ క్రీడల్లో సత్తాచాటిన ఆమె.. ఏకంగా 60 మీటర్ల త్రో విసిరి కాంస్య పతకం తన ఖాతాలో వేసుకుంది. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో మహిళల జావెలిన్ త్రో విభాగంలో భారత్కు దక్కిన తొలి పతకం ఇదే కావడం విశేషం. ఇదే పోటీలో పాల్గొన్న మరో భారతీయురాలు శిల్పా రాణి.. ఏడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాకు చెందిన కెల్సీ లీ బార్బర్ 64.43 మీటర్లతో స్వర్ణం సాధించగా.. మరో ఆసీస్ క్రీడాకారిణి మెకెంజీ లిటిల్ 64.27 మీటర్ల త్రో విసిరి సిల్వర్ సొంతం చేసుకుంది.