CWC 2023 | వన్డే వరల్డ్ కప్లో పడుతూ లేస్తూ నాలుగు మ్యాచ్లు ఆడితే ఒక్క విజయం మాత్రమే సాధించి బోణీ కొట్టిన శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు యువ పేసర్ మతీశ పతిరాన గాయంతో వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యాడు. ఈనెల 10న హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో పతిరాన భుజానికి గాయమైంది. దీంతో అతడు తర్వాత మ్యాచ్లకు దూరమయ్యాడు. పతిరన గాయం దృష్ట్యా అతడిని వరల్డ్ కప్ లో కొనసాగించడం కష్టమని భావించిన లంక టీమ్ మేనేజ్మెంట్.. అతడిని స్వదేశానికి సాగనంపింది.
పతిరాన స్థానంలో సీనియర్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ను జట్టులోకి చేర్చింది. నెదర్లాండ్స్తో మ్యాచ్ లోనే అందుబాటులో ఉన్నా అతడిని తుది జట్టులో ఆడించలేదు. ట్రావెలింగ్ రిజర్వ్గా ఉన్న మాథ్యూస్ తాజాగా పతిరాన గాయంతో అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. 2011తో పాటు 2015, 2019 వరల్డ్ కప్ ఆడిన మాథ్యూస్ యువ ఆటగాళ్లు ఉన్న లంకకు ఉపయోగపడేదే. 2015 వరల్డ్కప్ లో మాథ్యూస్ సారథిగా కూడా వ్యవహరించాడు. శ్రీలంక తమ తదుపరి మ్యాచ్ను ఈనెల 26న ఇంగ్లండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు మాథ్యూస్ తుది జట్టుతో చేరే అవకాశం ఉంది.
Angelo Mathews replaces injured Matheesha Pathirana in Sri Lanka’s World Cup squad
Pathirana had suffered a shoulder injury against Pakistan and missed Sri Lanka’s next two games pic.twitter.com/tzibI6UvRe
— CrickologyNews (@CrickologyNews) October 24, 2023
కాగా ఈ ప్రపంచకప్లో లంకకు ఇది రెండో షాక్. ఇదివరకే గాయం కారణంగా కెప్టెన్ దసున్ శనక టోర్నీ నుంచి దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానాన్ని చమీక కరుణరత్నె భర్తీ చేస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకూ నాలుగుమ్యాచ్లు ఆడిన లంక ఒకటి మాత్రమే గెలిచి మూడింట్లో ఓడి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇప్పటికే సంక్లిష్టంగా మారిన ఆ జట్టు సెమీస్ అవకాశాలు తదుపరి మ్యాచ్లలో ఒక్కటి ఓడినా ఆ రేసు నుంచి నిష్క్రమించినట్టే అవుతుంది.