Curtly Ambrose : ఐర్లాండ్ సిరీస్(Ireland Series)తో రీ – ఎంట్రీ ఇచ్చిన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మునపటి లయ అందుకున్నాడు. దాంతో, ఈ యార్కర్ కింగ్ టీమ్ఇండియాకు వెయ్యి ఏనుగుల బలమని వెస్టిండీస్ దిగ్గజం కార్ట్లీ అంబ్రోస్(Curtly Ambrose) అన్నాడు. వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) ముందు బుమ్రా తిరిగి జట్టులోకి రావడంతో భారత్ ప్రధాన పోటీదారుగా మారిందని అతను అభిప్రాయపడ్డాడు.
‘‘జస్ప్రీత్ బుమ్రా ప్రత్యేకమైన బౌలర్. అతడు తిరిగి రావడంతో భారత జట్టు బలం పెరిగింది. ఇప్పుడు టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్ ప్రధాన పోటీదారుగా కనిపిస్తోంది. అతడి చేరిక వల్ల భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుందనుకుంటున్నా. ముఖ్యంగా డెత్ ఓవర్స్లో బుమ్రా సామర్థ్యం చాలా గొప్పది. జట్టు విజయాలకు అది ఎంతో అవసరం. గాయం తర్వాత తిరిగి కోలుకొని పునరాగమనం చేయడం అంత తేలికైన విషయం కాదు. అయితే రీ – ఎంట్రీలో బుమ్రా మునుపటి పేస్ రాబడతాడా? అనేది కీలకం’ అని అంబ్రోస్ అన్నాడు.
జస్ప్రీత్ బుమ్రా
వెన్నెముక గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా సుదీర్ఘ విరామం (11 నెలలు) తర్వాత ఇటీవల ఐర్లాండ్తో సిరీస్లో పునరాగమనం చేశాడు. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో యంగ్ఇండియాకు కెప్టెన్గా వ్యవహరించిన బుమ్రా.. ఆడిన రెండు మ్యాచ్ల్లో 8 ఓవర్లు వేసి 4 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్న బుమ్రా.. పుష్కరకాలం తర్వాత భారత్లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్లో కీలకమవుతాడని మాజీలు కూడా అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే.